ఆంధ్రప్రదేశ్లోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పీఠం ఎన్డీయే కూటమి (GVMC Mayor) అధీనంలోకి వెళ్లింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరి వెంకటకుమారి మేయర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో, ఆమె పదవికి గుడ్బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
74 మంది ఎన్డీయే కూటమి నేతలు అనుకూలంగా ఓటు
ఈ అవిశ్వాస తీర్మానానికి 74 మంది ఎన్డీయే కూటమి నేతలు అనుకూలంగా ఓటేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని పూర్తిగా బహిష్కరించింది. సమావేశానికి హాజరుకాకపోవడం ద్వారా వారు తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం గెలవడంతో మేయర్ హరి వెంకటకుమారి అధికారాన్ని కోల్పోయారు.
కూటమి నేతలు కొత్త మేయర్ ఎంపిక
ఇప్పటికే ఎన్డీయే కూటమి నేతలు కొత్త మేయర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకునే ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. జీవీఎంసీలో చోటుచేసుకున్న ఈ రాజకీయ పరిణామం విశాఖలో రాజకీయ వేడి పెంచుతోంది.