Andhra Pradesh: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం స్పందించిన పవన్ కల్యాణ్

Andhra Pradesh: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం స్పందించిన పవన్ కల్యాణ్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలసిన శేషాచలం అడవులు అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి. తిరుమల సమీపంలో కార్చిచ్చు చెలరేగాయి.అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తిరుమల సమీపంలోని పాప వినాశనం డ్యామ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రమంగా మంటలు విస్తరించాయి. కుమారధార, పసుపుధార మంటలు వ్యాపించాయి.సమాచారం అందిన వెంటనే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మంటలను ఆర్పివేసే ప్రక్రియ చేపట్టారు. ఎండ తీవ్రతే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనావేశారు.

Advertisements

ఫారెస్ట్ రేంజ్‌

దీనిపై అటవీ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. తిరుమల శేషాచల అడవుల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మంటలు చెలరేగిన ఘటనపై అటవీశాఖ అధికారులు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ పీసీ నాయక్, ఫారెస్ట్ అడ్వైజర్ మల్లికార్జున్‌తో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్‌ పరిధిలోని ఓ గ్రామంలో తొలుత మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ధృవీకరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుండి సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు, 30 మంది సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కార్చిచ్చును అదుపులోకి తెస్తున్నామని వివరించారు.

సంచరించే

మంటలు ఉధృతంగా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వేసవి తాపానికి కార్చిచ్చులు రగిలే అవకాశం ఎక్కువగా ఉండటంతో, ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతం కావడంతో, వాటికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అదే విధంగా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Read Also: Revanth Reddy: మరి కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం

Related Posts
Chandrababu: అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం
Chandrababu: అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చురుగ్గా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి Read more

Pitapuram : ప్ర‌తి హామీని నెర‌వేరుస్తాం – ప‌వ‌న్ కల్యాణ్
We will fulfill every promi

పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం Read more

మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting 1

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. Read more

వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు- టీడీపీ
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

అక్రమ తవ్వకాలు, రవాణా ద్వారా భారీ ఆదాయం.టెర్రిన్స్, మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూరిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వల్లభనేనివంశీ అక్రమార్జన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×