అధికార వైస్సార్సీపీ పార్టీ మరో కుట్రకు తెరతీసింది – నాదెండ్ల మనోహర్‌

ఏపీలో అధికారంలో ఉన్న వైస్సార్సీపీ పార్టీ జనసేన పార్టీ ఫై మరో కుట్రకు తెరతీసింది ఆరోపించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌. రీసెంట్ గా వైజాగ్ లో తమ నేతలపై దాడి జరిగిందంటూ అన్యాయంగా జనసేన కార్య కర్తలపై కేసులు పెట్టారని , పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించిన నాదెండ్ల ..ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో మరో కుట్ర చేస్తుందని అన్నారు. వైస్సార్సీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై జనసేన వర్గాలు దాడి చేస్తాయని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మనోహర్ తీవ్రంగా ఖండించారు.

డీజీపీ కార్యాలయ వర్గాల నివేదిక ఆధారంగా మీడియా వార్తలు ఇస్తోందని తెలుస్తోందని.. రహస్యంగా ఉంచాల్సిన నివేదిక ఎలా బయటకు వచ్చిందో డీజీపీ చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రహస్య నివేదిక లీక్‌ కావడంపై డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు. జనసేన పార్టీ నాయకుల ఫోన్లు, తమ నిఘా పెట్టడం మాని, ఈ రహస్య అంశాలు బయటకు ఎలా వెళ్తున్నాయో డీజీపీ విచారణ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జనసేన ఫై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలా వైస్సార్సీపీ చేస్తుందని మండిపడ్డారు.