వేసవి వేడి అంటే మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్లో మామిడి పండ్లను తినడం, జ్యూస్ తాగడం ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ అంశం. రుచి, ఆరోగ్యం, సంతృప్తి – అన్నింటికీ ఈ పండు పరిష్కారం. కానీ, మామిడి పండ్లు శరీరానికి ఎంత మంచివో, అదే మామిడి జ్యూస్ అనేక సందర్భాల్లో హానికరం కూడా కావచ్చు.

మామిడి పండ్లను ‘ఫలాల రాజు’ అని ఎందుకంటారో దాని పోషకాల జాబితా చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో ఉండే విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, కాపర్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో అవసరమైనవే. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మ కాంతిని పెంచడం వంటి అనేక లాభాలను ఇస్తాయి.
మామిడి జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రమాదాలు
మధుమేహం ఉన్నవారు జాగ్రత్త!
మామిడి పండ్లలో సహజంగా ఉండే ఫ్రక్టోజ్ అనే చక్కెర మోతాదు అధికంగా ఉంటుంది. జ్యూస్గా తయారుచేసే సమయంలో ఇంకా అదనపు చక్కెర కలిపితే రక్తంలో షుగర్ లెవెల్ తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్నవారు మ్యాంగో జ్యూస్ తాగకూడదు.
బరువు తగ్గాలనుకునేవారు తాగరాదు
మామిడి జ్యూస్లో అధిక క్యాలరీలు ఉంటాయి. ఒక గ్లాస్ మ్యాంగో జ్యూస్లో సగటున 150-200 క్యాలరీలు ఉంటాయి. ఇది జిమ్ వెళ్ళి ఖర్చు చేసే శ్రమను నిస్పర్ధకంగా మార్చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మామిడి జ్యూస్కు దూరంగా ఉండాలి.
జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు మామిడి జ్యూస్ తాగినప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. పండు తినడమే మేలు కాని జ్యూస్ తాగడం హానికరం అవుతుంది.
కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు తాగొద్దు
ఫ్యాటీ లివర్ లేదా హిపాటైటిస్ ఉన్నవారు జ్యూస్ తాగితే మేటబాలిజం మీద ఒత్తిడి వస్తుంది. కాలేయంపై భారం పెరగడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి
మామిడి పండ్ల పైన ఉండే పొడి లేదా పుల్ల టేగుల వల్ల కొందరికి చర్మ దురద, ఎలర్జీ లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు మ్యాంగో జ్యూస్ తాగితే కూడా అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత వెంటనే తాగరాదు. ఖాళీ కడుపుతో తాగకూడదు. జ్యూస్తో పాటు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇది హైడ్రేషన్లో సహాయపడుతుంది. నేరుగా పండు తినడం జ్యూస్ తాగడంపై మేలు. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా పండులో ఉంటుంది, జ్యూస్లో కాదు. మామిడి పండ్లు వేసవిలో ఆరోగ్యానికి మంచివే కానీ జ్యూస్గా తాగేటప్పుడు ఆరోగ్య పరిస్థితిని బట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అనవసరంగా మోతాదు మించకుండా తీసుకుంటే, మామిడి జ్యూస్ మంచిదే! అయితే ఎవరైతే మధుమేహం, బరువు అధికం, జీర్ణ సంబంధ సమస్యలు, కాలేయ సమస్యలు లేదా అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారో వారు జ్యూస్ తాగకూడదు. ప్రత్యామ్నాయంగా నేరుగా పండు తినడం ఉత్తమం.
Read also: Health:నోటి ద్వారా శ్వాస తీసుకుంటే ఏమవుతుందో తెలుసా!