భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను చంపిన అల్లుడు

అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హత్య చేసాడు. పీలేరు నియోజకవర్గం కె.వి.పల్లి మండలంలోని నారమాకులపల్లి లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరేటి నీలావతి పెద్ద కుమార్తెకు, అల్లుడికి మధ్య కొద్దీ నెలల క్రితం విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వద్దే ఉంచుకుంది.

శుక్రవారం అల్లుడు విజయ్ చిత్తూరు నుంచి నారమాకులపల్లికి వచ్చి అత్తతో గొడవపడ్డాడు. తన భార్యను కాపురానికి పంపాలని నిలదీశాడు. దీనికి అత్త నిరాకరించగా.. శనివారం ఉదయం పొడవాటి కర్రతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.