Maldives President Mohamed Muizzu and his wife Sajidha Mohamed visit Taj Mahal in Agra

సతీసమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

ఆగ్రా: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తన సతీమణితో కలిసి మంగళవారం తాజ్‌మహల్‌ ను సందర్శించారు. తాజ్‌మహల్‌ ముందు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఆయన ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకోగానే ఉత్తరప్రదేశ్‌ మంత్రి యోగేంద్ర ఉధ్యాయ్ వారికి స్వాగతం పలికారు. కాగా ముయిజ్జు తాజ్‌మహల్‌ను సందర్శించే సమయంలో ప్రజలకు రెండు గంటలపాటు లోపలికి వెళ్లడానికి అనుమతి ఉండదని ఆగ్రా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ప్రకటించిన విషయం తెలిసిందే.

నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయిలో సమాలోచనలు జరిపారు. భారత్, మాల్దీవుల బంధం శతాబ్దాల నాటిదని మోదీ పేర్కొన్నారు. ప్రతీ సంక్షోభంలోనూ ఆ దేశానికి తొలుత ఆపన్నహస్తం అందిస్తున్నది ఢిల్లీయేనని గుర్తుచేశారు.

మాల్దీవులకు తాజాగా 40 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భారత్‌ సహకారంతో మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేను ముయిజ్జు, మోడీ సంయుక్తంగా వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. మాల్దీవుల్లో ఓడరేవులు, రోడ్డు నెట్‌వర్కులు, పాఠశాలలు, గృహ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించేందుకు భారత్‌ తాజాగా ముందుకొచ్చింది. కాగా తమ దేశంలో పర్యటించాలని ముయిజ్జు మోదీని కోరగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.

Related Posts
మావోయిస్టులు దగ్ధం చేసిన కారు ఘటనలో ట్విస్ట్
Maoists mischief in Chintoo

చింతూరు మండలం సర్వేల గ్రామం సమీపంలో మావోయిస్టు మంగళవారం తెల్లవారుజామున కారును దగ్ధం చేశారు. అయితే కారులో ఉన్న వ్యక్తులను మావోయిస్టులు అవహరించారా? లేక భయంతో పారిపోయారా? Read more

రేపు ఢిల్లీలో శంకుస్థాపన చేయనున్న మోడీ
రేపు ఢిల్లీలో శంకుస్థాపన చేయనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 5న, ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఢిల్లీలో 12,200 కోట్లను మించి విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. Read more

రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
uttam

రేషన్ కార్డుల జారీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన Read more

నిర్మాత మనో అక్కినేని కన్నుమూత
Producer Mano Akkineni pass

తమిళ సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాతగా పేరు పొందిన మనో అక్కినేని ఈ నెల 19న కన్నుమూశారు. అయితే ఈ విషాదకర సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *