Majority exit polls show that BJP is the winner.

బీజేపీదే విజయమంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్..!

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాషాయ పార్టీ.. ఆమ్‌ఆద్మీకి గట్టి పోటీ ఇచ్చింది. మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్‌ కూడా తీవ్రంగా శ్రమించింది. కాంగ్రెస్‌ ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

image

ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలుండగా.. జేవీసీ పోల్‌ బీజేపీకి 39-45, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 32-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్‌ నౌ బీజేపీకి 39-45, ఆప్‌కి 22-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొంది. మ్యాట్రిక్స్‌ సంస్థ ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 0-1 వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ఆప్‌కు 25-28, బీజేపీకి 39,45, కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వస్తాయని చెప్పింది. పీపుల్స్‌ పల్స్‌ కాంగ్రెస్‌కు ఆప్‌కు 10-19, బీజేపీకి 51-60 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌ ఆప్‌కు 25-29, బీజేపీకి 40-44, కాంగ్రెస్‌కు 0- ఒక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేశాయి.

కాగా, 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి మాజీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన సందీప్‌ దీక్షిత్‌, బీజేపీకి చెందిన ప్రవేశ్‌ వర్మ సైతం ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఢిల్లీ సీఎం అతిషి మర్లేనా కల్కాజీ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి రమేశ్‌ బిధురి పోటీ చేస్తున్నారు.

Related Posts
IRCTC సేవల్లో అంతరాయం..
IRCT Major Outage Hits Indian Railways

భారతీయ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ రోజు గణనీయమైన అవుటేజ్‌లను ఎదుర్కొంది. దీని ఫలితంగా, ప్రయాణికులు రైలు టికెట్లను బుక్ చేయడానికి వెబ్‌సైట్ Read more

రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు ఆగ్రహం
రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు ఆగ్రహం

'ఇండియాస్ గాట్ టాలెంట్ (IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..? మీ Read more

క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం
క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి జనవరి 2 న ప్రారంభించిన నిరాహార దీక్షలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో Read more

శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
kavitha Yadagri

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక అభిషేకం చేయడం అనంతరం స్వాతి Read more