Who will own Ratan Tatas p

రతన్ టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం..

దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రతన్ టాటాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ2 సర్కార్ 2008లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది. అయితే దేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్న అవార్డును రతన్ టాటాకు ఇవ్వాలని ఆ తర్వాత దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి. దేశానికి ఆయన చేసిన సేవలు, దేశ అభివృద్ధి కోసం టాటా గ్రూప్ చేసిన ఎన్నో కార్యక్రమాలకు గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వడమే సరైంది అని ఎంతోమంది బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటా.. ఇలాంటి ఆడంబరాలను ప్రోత్సహించేవారు కాదు. ఇక తనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తిన వేళ.. ఒక సందర్భంలో దానిపై ఆయన స్పందించారు.

ఇలాంటి డిమాండ్లు, ప్రచారం వెంటనే ఆపేయాలని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిన రతన్ టాటా.. భారతీయుడిగా పుట్టడమే తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. దేశ అభివృద్ధిలో, దేశ సంపద పెరగడంలో తన వంతు సహకారం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.

ఇక ఇప్పుడు ఆయన మరణంతో మరోసారి రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈరోజు నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.

Related Posts
స్టార్‍ హాస్పిటల్స్లో పక్షవాత చికిత్సా కేంద్రం ప్రారంభం
Start of Paralysis Treatment Center at Star Hospitals

హైదరాబాద్‍: జనవరి హైదరాబాద్‍ బంజారాహిల్స్, రోడ్‍ నెం. 10లోని స్టార్‍ హాస్పిటల్స్లో నేడే వారి నూతన ‘స్టార్‍ కాంప్రెహెన్సివ్‍ స్ట్రోక్‍ కేర్‍ సెంటర్‍’కు శుభావిష్కరణను నిర్వహించారు. దీనితో, Read more

పురాతన ఆలయంలో విగ్రహం చోరీ
పురాతన ఆలయంలో విగ్రహం చోరీ.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఉన్న ఒక పురాతన రామాలయంలో జరిగిన ఘటన ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. ఈ దేవాలయంలోని విగ్రహాలు దొంగిలించబడినట్లు తెలియగానే గుడి నిర్వహణ బాధ్యతలు చూసే వంశీదాస్ Read more

సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం
సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం

వాణిజ్యం, సుంకాల సంబంధిత అంశాలపై చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. వైట్‌హౌస్‌లో Read more

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ
Liquor shops lottery today in AP

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *