Maharashtra and Jharkhand elections will be held today

నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు మోగనున్న నగారా

న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 నిముషాలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది.

దీనికి సంబంధించిన ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా సమావేశం జరగనుంది. కాగా.. అనధికారిక సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్‌లో ఓటింగ్ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావలితో పాటు ఝార్ఖండ్‌లో ప్రధాన పండగైన ఛఠ్ పూజ, దేవి దీపావళి పండుగలు కూడా వరుసగా ఉండడంతో ఇవి ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నవంబర్ రెండో వారంలో లేదా మూడో వారంలో ఓటింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా మరో 45 ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలకు కూడా మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి కూడా ఈ సమావేశంలోనే నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నియోజకవర్గా్ల్లో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వాయనాడ్ పార్లమెంట్ స్థానంతో పాటు బెంగాల్‌ టీఎంసీ నేత షేక్ నూరుల్ ఇస్లామ్ మరణంతో ఖాళీ అయిన బషీర్‌హాట్ ఎంపీ స్థానాలున్నాయి.

Related Posts
ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు
online certificate

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇది విద్యార్థులు, వారి Read more

దిల్ రాజు ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ రైడ్స్
it rides dil raju

టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ Read more

మ్యూజికల్ నైట్ కు టికెట్ కొని హాజరైన సీఎం చంద్రబాబు
chandrababu euphoria musica

తనే స్వయంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ Read more

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్‌
Telangana government announced Diwali bonus for Singareni workers

హైరదాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దీపావళి ప్రత్యేక బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా సర్కార్ రూ. 358 కోట్లు విడుదల చేసింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *