ఢిల్లీలో లోకేష్ ‘సత్యమేవ జయతే’ దీక్ష

పాల్గొన్న టీడీపీ ఎంపీలు , పలువురు నేతలు

Lokesh 'Satyameva Jayate' deeksha in Delhi
Lokesh ‘Satyameva Jayate’ deeksha in Delhi

New Delhi: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని నిరసిస్తూ ఢిల్లీ లో సోమవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘సత్యమేవ జయతే’ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జనం కోసం జన్మించిన మహాత్ముడు, దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యమే లక్ష్యంగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. సత్యం, అహింస ఆయుధాలుగా అందించిన బాపూజీ మన ధర్మపోరాటానికి స్పూర్తి అని అన్నారు. కార్యక్రమంలో టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర, కేశినేని నాని, టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్ రావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/