Liquor prices to increase in Telangana

మందుబాబులకు షాకింగ్ న్యూస్..తెలంగాణలో పెరుగనున్న మద్యం ధరలు..!

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఆబ్కారీ శాఖ శ్రమిస్తోంది. ఏపీలో మద్యం ధరలను సమానంగా చేయాలని ప్రభుత్వ యోచనలో ఉందని సమాచారం. త్వరలో బీరుకు రూ. 20, లిక్కర్‌కు రూ. 20 నుంచి 70 వరకు పెంచే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ధరలు పెరగడం ద్వారా ప్రతినెలా రూ. 1,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ ఆదాయం రావడం తగ్గుతున్నది. గుడుంబా మరియు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని ఆ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో నమోదైన కేసులు ఈ విషయం స్పష్టంగా చెబుతున్నాయి. గతేడాది మొదటి 6 నెలల్లో 9,108 గుడుంబా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది అదే సమయంలో 18,826 కేసులు నమోదు అయ్యాయి. అంటే రెట్టింపు కేసులు నమోదవ్వడంతో పాటు పదివేల మందికి పైగా గుడుంబా కేసుల్లో అరెస్టు చేశారు.

అక్రమ మద్యం సరఫరా మరియు గుడుంబా తయారీలో నిష్క్రమించేందుకు అబ్కారీ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా వ్యాట్ మరియు ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ. 36,000 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ. 9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ. 8,040 కోట్లు వచ్చాయి. అందువల్ల, ఇప్పటివరకు ఈ రెండు మార్గాల ద్వారా రూ. 17,533 కోట్లు ఆదాయం వచ్చినట్లు అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇదే మొత్తాన్ని సాధించగలమని భావిస్తే, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 35,000 కోట్లను అధిగమించేందుకు అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.

Related Posts
షాంఘై సదస్సు..ఇస్లామాబాద్ చేరుకున్న మంత్రి జైశంకర్..పాక్‌ కీలక వ్యాఖ్యలు
Minister Jaishankar arrived in Islamabad. Pakistan key comments

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ నిన్ననే (మంగళవారం) ఇస్లామాబాద్ చేరుకున్నారు. Read more

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ని ఉపయోగించిన నర్సు
కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ని ఉపయోగించిన నర్సు

కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా హనగల్ తాలూకాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నర్సు, గాయానికి కుట్లు వేయాల్సిన Read more

హరి హర వీరమల్లు నుండి కొత్త పోస్టర్
హరి హర వీరమల్లు నుండి కొత్త పోస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా మీద అభిమానుల్లో Read more

దుర్గ‌మ్మ ను దర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్
pawan durgamma

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *