Rain: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

Rain: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి తీవ్రత కొనసాగుతున్న వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఒక వైపు మండే ఎండలు,మరో వైపు భారీ వర్షాలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక, ఇప్పుడున్న పరిస్థితు ల్లో వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ లో యంత్రాంగం అప్రమత్తం అయింది.ఏపీలో ఈ రోజు (గురువారం) పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మరోవైపు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86మిమీ, రామచంద్రపురంలో 73.5మిమీ, కొత్తపేటలో 64.5మిమీ, శ్రీకాకుళం జిల్లా నివగాంలో 52మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిమీ మే వర్షం నమోదైంది.

Advertisements
 Rain: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

తేలికపాటి

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడిం చారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 40.7°C, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా నేమకల్లులో 40.6°C, పల్నాడు జిల్లా కాకానిలో 40.2°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గురువారం(మే 08) తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రేపు తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

Read Also :Andhra Pradesh: అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం

Related Posts
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు స్పందన
chandrababa and vijayasai reddy

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శుక్రవారం Read more

Telangana: సంతానం లేదన్న సాకుతో భార్యను హత్య చేసిన భర్త
Telangana: సంతానం లేదన్న సాకుతో భార్యను హత్య చేసిన భర్త

ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ కు Read more

Chittoor Dist : ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 నెలలకే దారుణం
young woman who was killed

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాజీ నగర్‌కు చెందిన యువతి యాస్మిన్ భాను అనుమానాస్పదంగా మృతి చెందింది. మొదట ఇది ఆత్మహత్యగా భావించగా, Read more

Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్
Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×