తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో మళ్లీ అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న రాజధాని ప్రాంతం ఇప్పుడు మళ్లీ చైతన్యంతో కదలికలోకి వచ్చింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఊపుని కనిపెడుతోంది. విస్తరించిన రహదారులు, లేఅవుట్ల అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అమరావతిలో భూవ్యాపారానికి క్రేజ్ పెరిగింది.
భూముల ధరలు భారీగా పెరుగుదల
రియల్టర్ల చెబుతునట్లు, ఇప్పటి భూముల ధరలు దాదాపు నాలుగేళ్ల తర్వాత వచ్చే స్థాయికి చేరుకున్నాయి. ఐదేళ్లుగా కొనుగోళ్లకు దూరంగా ఉన్న రైతులు, పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్లీ భూములు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. రియల్టర్లు తమ లేఅవుట్లను ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అమరావతికి మళ్లీ రాజధాని హోదా
ఇప్పుడే భూములు కొనుగోలు చేయాలి అనే ఆలోచన కొనుగోలుదారులలో స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతికి మళ్లీ రాజధాని హోదా లభించవచ్చనే ఆశావాదం భూముల ధరలకు రెక్కలు ఇచ్చింది. రాజకీయ స్థిరత నేపథ్యంలో రియల్టర్లు కూడా భారీగా మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఈ వేగం కొనసాగితే భవిష్యత్తులో అమరావతి రియల్ ఎస్టేట్ రంగం భారీ స్థాయిలో ఎదుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Liquor Scandal : రాజ్ కసిరెడ్డి పీఏ అరెస్ట్