ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భూముల కబ్జాలు, తప్పుడు దస్తావేజుల తయారీ, భూ దందాలపై ఆయన గట్టిగా హెచ్చరించారు. భవిష్యత్లో ఇలాంటి అక్రమాలపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల ఆస్తులను హక్కుగా గుర్తించి, వాటిని రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ నాల్గు జిల్లాలో భూ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువ
విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప వంటి జిల్లాల్లో భూ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో మంత్రుల దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా, తానే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తానని చెప్పారు. అన్యాయంగా భూములు కోల్పోయినవారికి న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
భూ దందాలు చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టాం
అక్రమ భూ దందాలు చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, పాలన పట్ల విశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజల ఆస్తులపై హక్కును కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని చెప్పిన ఆయన, భవిష్యత్లో ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం లేకుండా దశలవారీగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.