KTR key comments on Amrit tenders

రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఘాటైన విమర్శలు

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ పై ఘాటైన విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో అర్ధసత్యాలు, అవాస్తవాల‌తో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. “రేవంత్ గారు, మీరు ఇంతవరకు చెప్పిన మాటలు అబద్ధమే, మీ చేతలు కూడా అబద్ధమే. మీరు కేవలం అవాస్తవాలు పుట్టించడంలో మాత్రమే నిపుణులు,” అని KTR పేర్కొన్నారు.

Advertisements

‘రేవంత్.. మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?
మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం..
అర్దసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు!
కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా?
50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం?
RBI Handbook of India States బట్టి తెలంగాణ అప్పు ఎంత వుందో తేటతెల్లమవుతుంది!
ఢిల్లీకి మూటలు మూసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు!
Lies, more lies and nothing but LIES!’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని, ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను.. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్లు తెరవాలని సూచించారు. వర్షం కురుస్తుందో లేదో, సాగునీరు, కరంటు, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో.. లేదో? అని తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలన్నారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దన్నారు. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దన్నారు.

Related Posts
Asaduddin Owaisi : అన్ని పార్టీలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించాలి: అసదుద్దీన్‌ ఒవైసీ
All parties should be invited to an all party meeting.. Asaduddin Owaisi

Asaduddin Owaisi : పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ నిజమైన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Read more

క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!
క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!

కేవలం 95 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న స్మృతి మంధాన, వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన భారత మహిళగా నిలిచింది. మిథాలీ రాజ్ Read more

“మాద‌క‌ద్ర‌వ్యా”ల‌ పై స్పందించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్
Deputy CM Pawan Kalyan

అమరావతీ: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మాద‌క‌ద్ర‌వ్యాల‌ పై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఏపీలో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వ అవినీతి నుంచి Read more

కమాండెంట్ గంగారాం మృతిపట్ల కేటీఆర్ సంతాపం
KTR condoles the death of Commandant Gangaram

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, 17వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం (58) మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. Read more

Advertisements
×