వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో భూసేకరణ వివాదం చుట్టూ మళ్లీ రాజకీయ జ్వరం పుంజుకుంది. పోలీసులు బాధితులను ఇంకా వేధిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.”ఇలాంటి అధికారులు ఎవరైనా వదిలిపెట్టం. పేర్లు రాసిపెడతాం,” అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అయినా ఎక్కడ ఉన్నా గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా లగచర్ల మహిళలు విరాళాలు అందజేశారు. అదే వేళ కేటీఆర్ మాట్లాడుతూ, మహిళలపై పోలీసులు అతి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.”వెంటనే బాధ్యులను విధుల నుంచి తొలగించాలి,” అని డిమాండ్ చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు క్షమాపణ చెప్పాలి,” అంటూ చెప్పిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టినట్లు గుర్తు చేశారు.“పోలీసుల దుర్వినియోగం క్షమించదగినది కాదు,” అని స్పష్టంచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
చర్యలు లేకపోతే తిరుపతి రెడ్డి పాత్రను అనుమానించాల్సి వస్తుంది
ఎన్హెచ్ఆర్సీ సూచించిన 6 వారాల గడువులో చర్యలు లేవంటే… సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పాత్రపై అనుమానం రావొచ్చని కేటీఆర్ అన్నారు.లగచర్ల భూసేకరణపై హైకోర్టు స్టే ఉన్నా… ప్రభుత్వం దానిని కొనసాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “ఇది న్యాయ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడమే,” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Hyderabad: మత్తుమందు ఇచ్చి వ్యాపారి ఇంటిని దోచిన నేపాలీ పనివాళ్లు