KTR టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌

KTR : టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌

KTR : టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌ బారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏళ్ల విజయ యాత్రను పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రత్యేక సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్లకు పైగా ప్రజాస్వామికంగా విజయవంతంగా కొనసాగుతున్న రెండు ప్రధాన పార్టీలు మాత్రమే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ (టీడీపీ), మరొకటి బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు. ఆ సమయంలో తెలుగు ప్రజలను “మద్రాసీలు” అని పిలిచేవారని, తెలుగువాళ్లకు ప్రత్యేక గౌరవం తీసుకురావడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ చేసిన కృషి వల్లే తెలుగు ప్రజలకు భారతదేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Advertisements
KTR టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌
KTR టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌

తెలుగువారికి ప్రత్యేక గౌరవం తీసుకురావడంలో ఎన్టీఆర్ ఎంత ముఖ్యపాత్ర పోషించారో, అదే విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ కూడా పోరాడారని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడి పార్టీ స్థాపించగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ ను ముందుకు నడిపించారు అని ఆయన వివరించారు. శూన్యం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల విజయాన్ని ఘనంగా జరుపుకోవడానికి పార్టీ నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకలకు సమాయత్తమవుతున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉత్సవాలకు సంబంధించిన ముఖ్య అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్తు కార్యచరణ, వచ్చే ఎన్నికల వ్యూహంపై కూడా కేటీఆర్ దృష్టిపెట్టారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.తెలంగాణ రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 25 ఏళ్ల విజయాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించనున్నాయి.

Related Posts
Vontimitta : ఒంటిమిట్ట శ్రీ‌సీతారాముల‌ కళ్యాణం.. 70వేల తిరుమ‌ల ల‌డ్డూలు
Sri Sitaram wedding in Vontimitta.. 70 thousand Tirumala laddus

Vontimitta : శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 Read more

Harish Rao : ఇందిరమ్మ ఎమర్జెన్సీలా రేవంత్ పాలన : హరీశ్ రావు
Revanth rule is like Indiramma Emergency.. Harish Rao

Harish Rao : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రశాంతంగా వారు నిరసన ర్యాలీలు తీస్తుంటే పోలీసులు Read more

ఈ రోజు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల
Tet notification released today in Telangana

హైదరాబాద్‌ : తెలంగాణలో ఈరోజు టెట్‌ పరీక్షకు సంబంధించిన మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే సంవత్సరానికి టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రెండుసార్లు నిర్వహిస్తామన్న తెలంగాణ Read more

Revanth Reddy;దీపావళి పండుగను విదేశీ మద్యంతో జరుపుకుంటున్నారా? అని ప్రశ్న
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్

జన్వాడ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి దీపావళి పండుగలో చిచ్చుబుడ్లు కాల్చే సంప్రదాయం ఉంటే, ఫాంహౌస్‌లో మాత్రం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×