ktr response to Central Budget

బడ్జెట్ లో తెలంగాణకు చిల్లి గవ్వ కూడా రాలే : కేటీఆర్‌

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisements
image

ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీకి గులాం గిరి చేస్తున్న బడే భాయ్, చోటే భాయ్ అనుబంధంతో తెలంగాణకు నయా పైసా లాభం లేదని తేలిపోయిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నిస్సహాయ మంత్రులు చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తే.. ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని.. తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోసేందుకేనని ఈరోజు తేలిపోయిందన్నారు. నిధులు తేలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే కేంద్రానికి ఎంత చిన్నచూపొ మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసిందన్నారు. బడ్జెట్ లో కేవలం బీజేపీ పాలిక రాష్ట్రాలకు పెద్దపీట వేసి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేశారని కేటీఆర్‌ అన్నారు.

Related Posts
జానీ మాస్టర్‌కు రంగా రెడ్డి జిల్లా కోర్టులో స్వల్ప ఊరట
Johnny Master in police custody

Ranga Reddy District Court got a little relief for Johnny Master హైదరాబాద్‌: తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతిపై Read more

Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో పరిగెత్తిన ప్రజలు
Telangana

ఉత్తర తెలంగాణలో భూప్రకంపనలు – ప్రజల్లో భయం, నిపుణుల హెచ్చరికలతో అప్రమత్తత ఉత్తర తెలంగాణను భూప్రకంపనలు ఉలిక్కిపడేలా చేశాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు Read more

సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
Justice Sanjiv Khanna sworn in as CJI

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాఈరోజు( సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి Read more

కేజ్రీవాల్‌పై దాడికి యత్నం
liquid thrown on arvind kej

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన Read more

Advertisements
×