నా మీద కోపంతో సిరిసిల్లను బలి చేయొద్దు: సీఎంకు కేటీఆర్‌ విజ్జప్తి

ktr

హైదరాబాద్‌: నా మీద కోపంతో సిరిసిల్లను బలి చేయొద్దు..ప్లీజ్‌ అంటూ రేవంత్‌ రెడ్డిని విజ్ఙప్తి చేశాడు కేటీఆర్‌. పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని.. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేర పూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోందని తెలిపారు. నేతన్నల బతుకుకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసి వాళ్ల పొట్ట కొట్టటం న్యాయమేనా? అని నిలదీశారు.

ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారికి ఉపాధి లేకుండా చేయటమా?ఇది ప్రజాపాలనా? ప్రజల ప్రాణాలు తీసే పాలనా? అంటూ నిప్పులు చెరిగారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే మీకు సోయి వస్తుందని ఆగ్రహించారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలను వెంటనే చేపట్టాలి. మరొక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలి పెట్టవద్దు ముఖ్యమంత్రి గారు. వారికి మా కన్నా ఎక్కువ మంచి చేసి వారి ప్రాణాలు నిలబెట్టండని కోరారు.