చంద్రబాబు ఫై కేటీఆర్ ప్రశంసలు

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..ఏపీ సీఎం చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు. తీవ్ర మైన వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. నాలుగు లక్షల మందికి పైగా విజయవాడలో నిరాశ్రయులయ్యారు. వారికి పెద్ద ఎత్తున సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి తక్షణమే వారి అన్నార్తుని తీరుస్తోంది అక్కడి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ల ద్వారా పెద్ద ఎత్తున వంటలుచేయిస్తూ మారుమూల ప్రాంతాలకు ఆహార పొట్టాలను సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛంద సేవలు కూడా చంద్ర బాబు పిలుపునందుకుని చురుకుగా వరద సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి.

రెస్క్యూ టీమ్ ఇప్పటికే వేలాది మందిని కాపాడింది. లక్షల సంఖ్యలో పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాయి. వరద నీటి మధ్యలో ఇరుక్కున్న వారిని హెలికాప్టర్లు, మరబోట్ల సాయంతో వారిని ఒడ్డుకు చేరుస్తున్నారు. చంద్రబాబు గత నాలుగు రోజులుగా విజయవాడలోనే మకాం ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వరద సహాయక చర్యలపై చంద్రబాబు స్పందిస్తున్న తీరు పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు.

అప్పటికప్పుడు ఆరు హెలికాప్టర్లు తెప్పించి, 150 కి పైగా రెస్స్కూ టీమ్ బో ట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను సకాలంలో ప్రాణ నష్టం నుంచి కాపాడటంలో బాబు పనితీరు బాగుందంటూ కేటీఆర్ తన అధికార ఎక్స్ ద్వారా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ వరద సహాయక చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందారని పేర్కొన్నారు.