స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసిన కేటీఆర్..హరీష్ రావు

స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. అధికారుల వ్యవహార శైలిని సభాపతి దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెచ్చారు. కాగా, పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు సమయంలో గైర్హాజరు కావడం సంచలనంగా మారింది. స్పీకర్ ను కలిసిన వారిలో కేటీఆర్, హరీష్ రావు లతో పాటు తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ప్రొటోకాల్ అంశం కాకరేపుతుంది. అధికార ఎమ్మెల్యే ను పిలవకుండా , కనీసం కబురు కూడా పంపకుండా కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారని మొదటి నుండి బిఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది. నిన్న మహేశ్వరం లో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి ని పిలవకుండానే బోనాల చెక్కుల పంపిణి జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలిసి అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే కు చేదు అనుభవం ఎదురైంది. ఇలా అనేక చోట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతుండడంతో ఈరోజు స్పీకర్ ను కలిసి పిర్యాదు చేసారు.