రాహుల్ తీరుపై కేటీఆర్ ట్వీట్

తాజాగా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి..సోమవారం రాహుల్ గాంధీని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ వెళ్లిన పోచారం అక్కడ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిశారు. తాజాగా, ఈ ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన కేటీఆర్ రాహుల్ గాంధీ తీరుపై ఫైర్ అయ్యారు.

రాహుల్ గాంధీ ఓ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరించి తద్వారా ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. అదే రాహుల్ గాంధీ ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ఫైర్ అయ్యారు.