మాజీ మంత్రి పువ్వాడ ను పరామ‌ర్శించిన కేటీఆర్

గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. గ‌త కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పువ్వాడ అజయ్ కుమార్‌ను కేటీఆర్ క‌లిసి, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు.

ప్ర‌స్తుతం ఆరోగ్యం ఎలా ఉంద‌ని వాక‌బు చేశారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు, తదితరులు ఉన్నారు.