ktr comments on congress government

కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. విద్యుత్‌ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే చార్జీలు పెంచి జనంపై భారం మోపేందుకు రెడీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గ్యారంటీ సరిగ్గా అమలు చేసిందన్నారు. ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే?. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Related Posts
సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ సమావేశం
Minister Nara Lokesh meeting with Sales Force CEO Clara Shih

అమరావతి: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన లాస్ వెగాస్‌లో జరిగిన సినర్జీ సమ్మిట్‌లో Read more

హైకోర్టుకు ఆర్జీ కార్ కేసు: మరణశిక్ష డిమాండ్
హైకోర్టుకు ఆర్జీ కార్ కేసు: మరణశిక్ష డిమాండ్

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించి, ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్య కేసులో సంజయ్ Read more

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సందర్భంగా తేదీ. 9.12.2024 కార్యక్రమాలు
victory celebrations cultural programmes

ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల సందర్భంగా తేదీ. 9.12.2024 కార్యక్రమాలు •ముఖ్యమంత్రి చే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ - 5.00 PM – సచివాలయంలో. •బహిరంగ Read more

తెలంగాణలో నేరాలు 22.5% సైబర్ నేరాలు 43% పెరిగాయి
తెలంగాణలో నేరాలు 22.5 సైబర్ నేరాలు 43 పెరిగాయి

తెలంగాణలో 2024లో నేరాల రేటు గణనీయంగా పెరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ వెల్లడించారు. 2023లో 1,38,312 కేసుల నుంచి 2024లో నేరాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *