ktr comments on congress

అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరతులు అని ఎద్దేవా చేశారు. అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమలవుతున్నది ఒకే ఒక్క గ్యారంటీ.. అది మోసం అంటూ ఫైరయ్యారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి సంబంధించిన నిరసన సెగ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తాకిందని చెప్పారు. రైతు డిక్లరేషన్‌ను ఎలా అమలుచేస్తున్నారో వివరించేందుకు తెలంగాణకు ఎందుకు రావడం లేదని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు.

Advertisements
image
image

రైతు భరోసాపై తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొంటూ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ సందర్భంగా రైతు భరోసాగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారని, ఇప్పుడు దానిపై కాంగ్రెస్‌ యూ టర్న్‌ తీసుకున్నదని పేర్కొన్నారు. 2024లో రైతులకు పెట్టుబడి సాయంగా విడుదల చేసింది గుండు సున్నానే అంటూ రాశారు. ఎకరాకు రూ.12 వేలు ఇస్తామంటూ రూ.15 వేలపై సీఎం రేవంత్‌ రెడ్డి యూ టర్న్‌ తీసుకున్నారని పోస్టర్లలో తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అంటేనే కన్నింగ్‌ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Related Posts
Waqf Bill : నేడు పార్లమెంట్ ముందుకు వక్స్ బిల్లు
Waqf Bill వక్ఫ్ బిల్లుపై చర్చ ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే

కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్‌లో వక్ఫ్ (Waqf) సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు లోక్సభలో మొదటగా, ఆ తరువాత రాజ్యసభలో చర్చించబడుతుంది. వక్ఫ్ బిల్లులో సవరణల Read more

Malavika Mohanan: విమర్శలు తిప్పికొట్టిన నటి మాళవిక
విమర్శలపై ఘాటుగా స్పందించిన నటి

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరియు మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హృదయపూర్వం. ఈ చిత్రం ద్వారా సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ మరియు Read more

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ Read more

గిగ్ వర్కర్లకు కేంద్రం శుభవార్త.. కోటి మందికి బీమా!
Center is good news for gig workers.. insurance for crores!

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. Read more

Advertisements
×