పాల్వంచ కేటీపీఎస్లో 8 కూలింగ్ టవర్ల కూల్చివేత
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మొయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేయించారు. మొత్తం 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు.
వీటిని రెండు దశలుగా కూల్చివేశారు. తొలుత నాలుగు కూలింగ్ టవర్లను కూల్చివేయగా.. తర్వాత మరో నాలుగు కూలింగ్ టవర్లను కూల్చివేశారు. పాత కర్మాగారానికి సంబంధించిన కూల్చివేత, అందులోని మెటీరియల్ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్టు కంపెనీ రూ.465 కోట్లకు టెండర్ను దక్కించుకొని పనులు పూర్తిచేసిన విషయం విదితమే.