కొవ్వూరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. ఈసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.జవహర్ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దాదాపు పదిరోజుల క్రితం గుడివాడకు వెళ్లారు. మూడు రోజుల క్రితం ఆయన భార్య ఉష మరియు కుమారుడు ఆశిష్ తిరువూరుకు వెళ్లారు.అందువల్ల ఇంట్లో ఎవరూ లేకపోవడం దొంగలకి అవకాశమిచ్చినట్టు అయింది.శనివారం ఉదయం జవహర్ అనుచరుడు వి.వి.రాజు ఇంటికి వచ్చాడు.

ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసేందుకు వచ్చి వెనుక తలుపు తెరిచి ఉండటాన్ని గమనించాడు.అనుమానం వచ్చి లోపలికి వెళ్లగా, వస్తువులు చిదిరి ఉండటం చూసి షాక్ అయ్యాడు.వెంటనే జవహర్తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.చోరీ సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ జి. దేవకుమార్, పట్టణ సీఐ పి.విశ్వం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో జాగ్రత్తగా పరిశీలన చేపట్టారు. జవహర్ భార్య ఉష, కుమారుడు ఆశిష్ కొవ్వూరుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.ప్రాథమికంగా రెండు మొబైల్ ఫోన్లు, ఖరీదైన వాచీలు, ఒక టీవీ, రూ.45,000 నగదు మరియు వెండి వస్తువులు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. పోలీసులు రాజమండ్రి నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను పిలిపించి జవహర్ ఇంట్లో ఆధారాలు సేకరించారు.దొంగలు ఇంట్లోకి ఎక్కడి నుంచి ప్రవేశించారు? వారికి ముందుగా సమాచారం ఉందా? ఇలాంటివి తెలియజేసే ఆధారాల కోసం విచారణ కొనసాగుతోంది. వేలిముద్రలు సేకరించడంలో నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. జవహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇంట్లో పెద్దఎత్తున చోరీ జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రస్తుతం పోలీసులు గట్టిగా ముమ్మరంగా విచారణ చేస్తుండటంతో త్వరలోనే దోపిడీకి పాల్పడిన దుండగులు పట్టుబడతారని భావిస్తున్నారు.
Read Also : AP Government Jobs : జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం