తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్గా కె.పి. వివేకానంద గౌడ్, మండలిలో విప్గా సత్యవతి రాథోడ్ను నియమించారు.

కేసీఆర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి. రామారావు, పార్టీ ఇతర నేతలు సభాపతికి తెలియజేశారు. ఈ మేరకు నియామక పత్రాలను సభాపతికి అందజేశారు.కె.పి. వివేకానంద గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
సత్యవతి రాథోడ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గిరిజన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన కృషికి పేరుగాంచిన ఆమె సామాజిక సంక్షేమం , అభివృద్ధి కార్యక్రమాల కోసం వాదించడంలో పేరున్న వ్యక్తి. కెపీ వివేకానంద్ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా (ఎంఎల్ఏ) గా పనిచేస్తున్నారు. వివేకానంద్ స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులలో చురుకైన ప్రమేయం, మౌలిక సదుపాయాలు, విద్య , సమాజ సంక్షేమంపై దృష్టి సారించారు.