Konda Surekha defamation case should be a lesson. KTR key comments

కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు” అంటూ కేటీఆర్‌ హెచ్చరించారు.

రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Related Posts
75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!
Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన ప్రసంగంలో.. "ఈ పార్లమెంటు సెషన్ అత్యంత ప్రత్యేకమైనది. 75 సంవత్సరాల క్షేత్రంలో Read more

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదికను Read more

నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ పై విచారణ
ktr

తెలంగాణలో ఫార్ములా-ఈ కార్ రేసు కేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ Read more

జైలు శిక్ష పై వర్మ కామెంట్స్..
varmacase

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏకంగా వర్మకు మూడు నెలల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *