ప్రెస్ నోట్-05.02.2025
సచివాలయంలో హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్) రోడ్లపై ఆర్ & బీ అధికారులతో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
- రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
- నియమ, నిబంధనలకు అనుగుణంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించిన మంత్రి
- మండలం నుంచి జిల్లా కేంద్రానికి మిస్సింగ్ లింక్ రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి మిస్సింగ్ లింక్ రోడ్ల, అప్ గ్రేడేషన్ వంటి మూడు విభాగాలుగా నిర్మాణం
- హ్యామ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి, డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం.
- మంచిగా ఉన్న రోడ్లను హ్యామ్ లోకి తీసుకువస్తే కన్సల్టెంట్లే బాగుపడుతరు కాబట్టి, అధికారులు హ్యామ్ రోడ్లను గుర్తించే క్రమంలో.. అత్యంత దారుణంగా ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్ధేశం
- రోడ్ల నిర్మాణంలో డివైడర్లు, లైంటింగ్, రోడ్డు విస్తరణ, పేవ్ డ్ షోల్డర్స్ ఏర్పాటులో ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించేలా పకడ్భందీగా వ్యవహరించాలని తేల్చిచెప్పిన మంత్రి.
- 15 ఏండ్ల పాటు హ్యామ్ రోడ్డు తీసుకున్న సంస్థే పూర్తిగా మొయింటినెన్స్ చేయాల్సి ఉన్నందున రోడ్డు నాణ్యతలో రాజీపడకుండా ఉండేలే ప్రతీ ఇంజనీర్ జాగ్రత్తగా పనులను తనిఖీ చేయాలని సూచించిన మంత్రి.
- ఇప్పటి వరకు మట్టి రోడ్డుగా ఉన్న రోడ్లను గుర్తిస్తే.. తన దృష్టికి తీసుకువస్తే వెంటనే మంజూరీ చేస్తానని అధికారులకు చెప్పిన ఇచ్చిన మంత్రి.
- అటవీ అనుమతులతో మట్టిరోడ్లుగా ఉన్న రహదారులను భవిష్యత్తులో బీటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన మంత్రి.
- ప్రజాధనంతో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలో ఎక్కడా రాజీలేదని.. నాణ్యతలేని పనులు చేస్తే వెంటనే పనులను రద్ధు చేస్తామని హెచ్చరించిన మంత్రి.
- హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సమయం కావాలని అడిగిన కన్సల్టెంట్ల అభిప్రాయాలను తోసిపుచ్చిన మంత్రి.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సంవత్సరం సమయం తీసుకుంటే ప్రమాదాల్లో చనిపోతే ఏవరు బాధ్యత వహిస్తారని నిలదీసిన మంత్రి.
- ఏ రోడ్డు నిర్మాణమైన రెండు, మూడు నెలల్లో ప్రారంభించేలా వేగంగా ముందుకు వెళ్లాలని ఆర్డర్. హ్యామ్ రోడ్ల మంజూరీ రాష్ట్ర పరిధిలోనే ఉన్నందును ఆర్ & బీ డిపార్ట్ మెంట్ వేగంగా అనుమతులు మంజూరీ చేస్తుందని.. కాబట్టి వెంటనే సర్వే, టెండర్ పూర్వ పనులను ప్రారంభించాలని ఆదేశం
- జిల్లా కలెక్టర్ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయలను తీసుకోని ఎస్.ఈ., ఈఈ తో పాటు ఇతర అధికారులను కలుపుకొని హ్యామ్ రోడ్ల ను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
- వర్షాలు, దశాబ్ధ కాలంగా మరమ్మత్తులకు నోచుకోని రహదారులను తక్షణమే ఎస్టిమేట్స్ సిద్ధం చేసి షార్ట్ టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించాలన్నారు.
- ఇప్పటి వరకు 82 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు గుర్తించిన 1690.26 కిలోమీటర్ల రోడ్ల రిపేర్ల పనులను వెంటనే ప్రారంభించేలా టెండర్ పూర్వప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మార్గనిర్ధేషణం చేశారు.
- సర్వీస్ రూల్స్ ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే ఏఈఈ లను డీఈఈలుగా ప్రమోషన్లు ఇచ్చామని, ఈ నెలాఖరుకల్లా డీఈఈ, ఈఈ, ఎస్ఈ లకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా కసరత్తు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
- ఈ రివ్యూలో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, సీఈ (అడ్మిన్) తిరుమల, సీఈ (స్టేట్ రోడ్స్) మోహన్ నాయక్, వివిధ జిల్లాల ఎస్ఈ లు, ఈఈ లు ఇతర అధికారులు.


