ఒకరు కామం..మరొకరు డబ్బు మదంతో మాట్లాడుతున్నారు – కొల్లు రవీంద్ర

వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి , పేర్ని నాని లపై ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయసాయి రెడ్డి కి కామ పిచ్చి పట్టిందని అన్నారు. మీడియా సమావేశంలో ‘ఒరేయ్, ఏరా’ అని అనడం సిగ్గు పడాల్సిన విషయమని అన్నారు. ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వకుండా… మీడియా ప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడటం ఏమిటని
రవీంద్ర ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి తప్పులు చేశారని… ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మీడియా సంస్థల యాజమాన్యాలు, విలేకరులపై ఆయన చేసిన విమర్శలకు… భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. కామంతో విజయసాయిరెడ్డి, డబ్బు మదంతో పేర్ని నాని కళ్లుమూసుకుపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. విచారణ జరిపి త్వరలోనే అన్ని లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.