Kolikapudi Srinivasa Rao కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం

Kolikapudi Srinivasa Rao : కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం

Kolikapudi Srinivasa Rao : కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. ఆయన తీరు గతంలోనే హైకమాండ్ దృష్టికి వెళ్లి పలు హెచ్చరికలు వచ్చినా తన వైఖరిని మార్చుకోలేదని తాజా సంఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.కొన్నిరోజుల క్రితం మరో వివాదంలో కొలికపూడి పేరు మళ్ళీ మారుమోగింది. తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత అలవాల రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా టీడీపీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది.ఇదంతా చర్చనీయాంశంగా మారుతుండగానే నేడు మరింత కీలక పరిణామం చోటుచేసుకుంది.

Advertisements
Kolikapudi Srinivasa Rao కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం
Kolikapudi Srinivasa Rao కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం

తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.మాకు కొలికపూడి వద్దు అంటూ వారు బహిరంగంగా నినాదాలు చేశారు.ఈ హఠాత్పరిణామం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తక్షణమే స్పందించి,తిరువూరు కార్యకర్తలను సముదాయించేందుకు ముందుకొచ్చారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశమై, కార్యకర్తల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు. అలాగే, తిరువూరు కార్యకర్తల అభిప్రాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.ఈ సంఘటనలు చూస్తుంటే, కొలికపూడి వ్యవహారం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిందని అర్థమవుతోంది. హైకమాండ్ ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Related Posts
Alert: ఒక్కరోజే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
ఒక్కరోజే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా తగ్గుముఖం పట్టిన ఎండలు మళ్లీ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రెండు రోజులుగా కాస్తున్న ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు Read more

బద్వేల్ ఘటన-నిందితుడికి 14 రోజుల రిమాండ్
Shocked by girls death in

బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ Read more

10th Exams : టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్
ఏపీ ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను నిర్దేశిత విధానాల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు Read more

APPSC గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
APPSC Group2

2025 జనవరి 5 న నిర్వ్హయించాలనుకున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. గ్రూప్ -2 ఉద్యోగానికి సిద్దమయ్యే అభ్యర్థులకు అనుగుణంగా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×