Kodali Nani Resign news

రాజీనామా వార్తలపై కొడాలి నాని క్లారిటీ

వైసీపి లో రాజీనామా పర్వాలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది పార్టీకి , పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేయగా..తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం పలు చర్చలకు దారి తీసింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తారని, ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అవుతారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు వైసీపీ కార్యకర్తల మధ్య కలకలంగా మారాయి. ఈ ప్రచారంపై కొడాలి నాని స్వయంగా స్పందించారు. తాను వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే వార్తలు కూడా అవాస్తవమని తేల్చి చెప్పారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొడాలి నాని ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. ఇది ఎడిటెడ్ న్యూస్ అని, ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చని కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వైసీపీతో కొనసాగుతానని, ప్రజల సేవకు మద్దతుగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Related Posts
ఏపీలో ప్రత్యేకమైన వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు!
ఏపీలో ప్రత్యేకమైన వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ సేవలను ప్రజలకు అందించేందుకు ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. ఇది గవర్నెన్స్ కోసం మరింత సులభతరం చేసేందుకు Read more

జనసేనలో చేరడం పై తమ్మినేని సీతారాం క్లారిటీ
tammineni

వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తన పార్టీ మార్పు వార్తలను ఖండించారు. జనసేనలో చేరుతున్నారన్న ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. "నేను వైసీపీలోనే కొనసాగుతాను. జనసేనలో చేరాల్సిన Read more

ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి
Former Vice President Hamid Ansari who exercised the right to vote at home

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొబైల్‌ పోస్టల్‌ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకుని Read more

వెలగపూడిలో స్థలం కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు
CM Chandrababu is coming to Hyderabad today

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత నివాసం కోసం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి స్థలం కొనుగోలు చేశారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ స్థలం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *