Kishan Reddy letter to CM Revanth Reddy

Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy : హెచ్‌సీయూ వద్ద ప్రభుత్వానికి దక్కిన 400 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం నిర్ణయం పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ భూములను వేలం వేయొద్దని సూచించారు. హెచ్‌సీయూలో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

Advertisements
సీఎం రేవంత్ రెడ్డికి కిషన్

ఈ భూమిలో ఎలాంటి బఫెలో లేక్ , పికాక్ లేక్ లాంటివి లేవు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వం భూమి అని దీనికి హెచ్‌సీయూకి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భూమిలో ఎలాంటి బఫెలో లేక్ , పికాక్ లేక్ లాంటివి లేవని స్పష్టం చేశారు. రాతి నిర్మాణాలు, పుట్టగొడుగు ఆకారపు అపురూపమైన రాయిని గ్రీన్ జోన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్‌ డిస్కషన్ సందర్భంగా ఈ గచ్చిబౌలిలో వివాదాస్పద భూమిపై మాట్లాడారు.

దానిని డెవలప్‌మెంట్‌కు వాడుకుంటే తప్పేంటీ

అక్కడ ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. అక్కడ రిజర్వ్​ ఫారెస్ట్ లేదని జింకలు, పులులు, సింహాలు లేవని తెలిపారు. కానీ అక్కడ కొన్ని గుంట నక్కలు చేరి ఇలా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దానిని డెవలప్‌మెంట్‌కు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. గుట్టుగా ఎవరికీ కట్టబెట్టలేదని ఓపెన్​ ఆక్షన్​ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చేలా చేస్తున్నామని వివరించారు. యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి సంబంధించి విషయాల్లో భూసేకరణ చేస్తే అడ్డంకులు సృష్టించొద్దని సూచించారు.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం
anjireddy win

తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరింత బలపడింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన Read more

కొండా సురేఖను వదిలేది లేదు – అఖిల్
akhil surekha

తమ ఫ్యామిలీ ఫై అనుచిత వ్యాఖ్యలను చేసిన మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. 'కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, Read more

పోసాని కృష్ణమురళికి బెయిల్‌
పోసాని కృష్ణమురళికి బెయిల్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు,రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరైంది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ Read more

చైనాతో ట్రెడ్ వార్, మొదలుపెట్టిన డోనాల్డ్ ట్రంప్..
చైనాతో ట్రెడ్ వార్, మొదలుపెట్టిన డోనాల్డ్ ట్రంప్

"అంతా నా ఇష్టం" అంటున్నారు డొనాల్డ్ ట్రంప్, కానీ ఆ మాటలు ఇప్పుడు ప్రపంచంలో పెద్ద చర్చకు కారణం అవుతున్నాయి. అమెరికా ఫస్ట్ పథకాన్ని అంగీకరించిన ట్రంప్, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×