కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కిరణ్ చౌదరి

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ చౌదరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె కూతురు శ్రుతి కూడా కమలం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. హర్యానా కాంగ్రెస్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లలో శ్రుతి ఒకరు.

కిరణ్ చౌదరి.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు. శృతి చౌదరికి లోక్‌సభ టిక్కెట్ నిరాకరించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో తనను పట్టించుకోలేదని శృతి చౌదరి ఆరోపించారు. భివానీ-మహేంద్రగఢ్ పార్లమెంటరీ స్థానం నుంచి తన కుమార్తెకు లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని కిరణ్ చౌదరి కోరింది. కానీ పార్టీ నిరాకరించింది. దీంతో మనస్తాపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.