High Court: లులు మాల్‌‌కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court: లులు మాల్‌‌కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు మాల్ ఎంట్రీ ఇచ్చింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి భూముల్ని కేటాయించింది. అయితే విశాఖపట్నంలో లులు మాల్‌కు భూ కేటాయింపు అంశంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో షాపింగ్ మాల్‌ ఏర్పాటు చేసేందుకు లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు నామమాత్రపు ధరతో 13.83 ఎకరాలను కేటాయించబోతోందని పాక సత్యనారాయణను ఆశ్రయించారు. ఈ పిల్‌పై విచారణ జరగ్గా భూ కేటాయింపు వ్యవహారం ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందని ప్రభుత్వం తరఫున జీపీ కేఎం కృష్ణారెడ్డి, ఎస్‌జీపీ ప్రణతి వాదనలు వినిపించారు. భూముల్ని లులు గ్రూపుకు కేటాయిస్తారా? లేదా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వివరించారు. లులు మాల్‌కు సంబంధించి బిడ్లు ఆహ్వానించకుండా, సంస్థ ఛైర్మన్‌ ప్రతిపాదనల మేరకు భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది అశోక్‌రామ్‌ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం, విశాఖపట్నంలో లులు సంస్థకు భూ కేటాయింపు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిల్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని ఆదేశించింది.

Advertisements
 High Court: లులు మాల్‌‌కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

పెట్టుబడుల్ని

విశాఖలో లులు గ్రూప్ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఏపీఐఐసీ ద్వారా ఈ భూకేటాయింపులు చేయాలని ఆదేశించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్‌లో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీ బదలాయించాలని ప్రభుత్వం వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి 2017లో లులు గ్రూప్ విశాఖపట్నం బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్క్‌లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కానీ గత ప్రభుత్వం లులు గ్రూప్‌నకు చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది.దీంతో ఆ సంస్థ పెట్టుబడుల్ని వెనక్కు తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ లులు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్‌ల నిర్మాణం కోసం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ భూముల కేటాయింపుపై పిల్ దాఖలైంది. ఏపీ హైకోర్టు ఈ భూముల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందున్నది చూడాలి.

Read Also :Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్

Related Posts
‘నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే’ – జగన్ కు లోకేష్ హెచ్చరిక
1497422 lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్, మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా Read more

TTD: తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు ప్రత్యేక రైళ్లు
TTD: తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు ప్రత్యేక రైళ్లు

వేసవి స్పెషల్ రైళ్లతో తిరుపతి ప్రయాణం సులభం వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో దేవాలయ నగరిగా ప్రసిద్ధి చెందిన తిరుపతికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి Read more

Andhra: మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు
మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు

మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు Read more

Good Fry Day : గుడ్ ఫ్రై డే సందర్భంగా సీఎం చంద్రబాబు సందేశం
CM Chandrababu message on the occasion of Good Friday

Good Fry Day : గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సందేశం పంపారు. శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×