ktr modi

మోడీ , రేవంత్ లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా చెబుతున్నా. భయపడేది లేదు. ఈయనకు ఏం తెల్వదు. అనుకోకుండా తంతే గారెల బుట్టలో పడ్డట్లు వచ్చి పడ్డాడు’ అని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డితో పోరాడామని, రేవంత్ రెడ్డి తమకు ఓ లెక్క కాదన్నారు. రేవంత్ రెడ్డితో కొట్లాడేందుకు మనసు రావట్లేదన్నారు.

పాలన చేతకాక పనికిమాలిన మాటలు, పాగల్‌ పనులు చేస్తున్నారని, తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని సీఎం రేవంత్ పై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయిందని చెప్పారు. మూసీ ప్రాజెక్టులో రూ.లక్షా 50 వేల కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందని తెలిపారు. బిల్డర్లను, రియ‌ల్టర్లను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసిందన్నారు. మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్‌ను రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చేయకపోయినా, ఐటీ ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ని పదకొండేండ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిదని స్పష్టం చేశారు. ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్తన భాండాగార‌మైందని, దేశంలోనే ధాన్యరాశిగా మారిందని తెలిపారు.

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. ‌.. పాగ‌ల్ ప‌నులు. వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తుంది…— KTR (@KTRBRS) October 18, 2024

Related Posts
ముంబైలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్
sachin vote

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. భారత Read more

నాగబాబు ప్రమాణస్వీకార తేదీపై చంద్రబాబు, పవన్ చర్చ..!
pawan CBN Nagababu

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబును మంత్రి Read more

మరోసారి సమ్మె బాట పట్టిన బెంగాల్ వైద్యులు
bengal doctor back on strike announced total cease work from today

bengal-doctor-back-on-strike-announced-total-cease-work-from-today కోల్‌కతా: కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం తెలిసిందే. Read more

స‌హానా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వైఎస్‌ జ‌గ‌న్
YS Jagan counseled Sahana family

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలోని యువతి సహానా రౌడీషీటర్ నవీన్ చేత దాడి అయ్యి తీవ్రంగా గాయపడిన తర్వాత మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని గుంటూరు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *