Operation Sindoor: ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

Operation Sindoor: ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

సరిహద్దుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. భారత్ పై పాకిస్తాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటనచేసింది. ఇక నుంచి భారత్‌పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి యుద్ధ చర్యలకు భారత త్రివిధ దళాలు దీటుగా ప్రతిస్పందిస్తాయని తీవ్ర హెచ్చరికలు(Warnings) జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని కఠినతరం చేసినట్లు అర్థం అవుతోంది. ఇక నుంచి భారత భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.పహల్గామ్ ఉగ్రదాడి దానికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్‌తో షాక్‌కు గురైన పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి విరుచుకుపడుతోంది. ఒకవైపు నియంత్రణ రేఖ(Control line) వద్ద పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. పౌరులు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు అనే తేడా లేకుండా భీకర కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు డ్రోన్లు, క్షిపణులతో గగనతలంలో భీకర దాడులకు దిగుతున్నారు. అయితే భూమి, ఆకాశంలో పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టి పాక్‌కే గట్టి బుద్ధి చెబుతోంది.

Advertisements
cr 20250510tn681f1557aac2a
ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

సంకేతం

గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో ఉత్తర భారతదేశంలోని పలు సైనిక స్థావరాలు, పౌర నివాసిత ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం(Central Government) ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా అది నేరుగా భారత్‌పై చేసిన యుద్ధంగానే భావిస్తామని తేల్చి చెప్పింది. అలాంటి వారికి తగిన స్థాయిలో సైనిక చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాలకు భారత్ బలమైన సంకేతం పంపినట్లు అయింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని(India sovereignty), భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉందనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

Read Also :Operation Sindoor: పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు :అసదుద్దీన్ ఒవైసీ

Related Posts
‘జై జనసేన’ నినాదంతో చిరంజీవి!
‘జై జనసేన’ నినాదంతో చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావించిన ‘జై జనసేన’ నినాదం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్ల తర్వాత, ప్రజారాజ్యం పార్టీ గురించి ఆయన బహిరంగంగా మాట్లాడటమే కాకుండా, Read more

ILaiyaraaja: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా
ILayaraja: ఇళయరాజ లీగల్‌ నోటీసులు స్పందించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాణ సంస్థ

తమిళ హీరో అజిత్, డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌ Read more

Canada Election: ట్రంప్ కు వ్యతిరేక భావాలే మార్క్ కార్నీవిజయానికి నాంది?
ట్రంప్ కు వ్యతిరేక భావాలే మార్క్ కార్నీవిజయానికి నాంది!

కెనడా రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ, పియరీ పోయిలివ్రే కన్జర్వేటివ్ పార్టీని Read more

CSK : సీఎస్కే జట్టు ను వీడనున్న పతిరానా!
CSK : సీఎస్కే జట్టు ను వీడనున్న పతిరానా!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్ కె) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.  స్టార్ పేసర్ మతీషా పతిరానా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. దీని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×