కేరళలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం మరియు రాష్ట్ర సచివాలయం, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికార వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ దళాలు, బాంబ్ స్క్వాడ్లు అత్యవసరంగా స్పందించి ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

గత రెండు వారాలుగా కొనసాగుతున్న బాంబు బెదిరింపు
గత రెండు వారాలుగా కేరళలో వరుసగా ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 12 బాంబు బెదిరింపులు నమోదయ్యాయి. కేరళ హైకోర్టు సహా జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. నిన్న, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్లు టెర్మినల్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో కూడా తనిఖీలు సాగాయి. అయితే, ఇప్పటివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అధికారులు వీటిని నకిలీ బెదిరింపు కాల్స్గా గుర్తించారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
మరికొన్ని రోజుల్లో అంటే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ కేరళను సందర్శించనున్నారు. ప్రధానిగా రాష్ట్ర పర్యటనకు ముందు ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడం పోలీసు శాఖను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. భద్రత చర్యలు మరింత కఠినతరం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం హై అలర్ట్లో ఉంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నకిలీ కాల్స్ పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Read also: Modi condolence: వ్యాన్ ప్రమాదంలో మరణించిన మృతులకు ప్రధాని సంతాపం