కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రావత్ (68) మృతి చెందారు. వెన్నెముక గాయం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక శైలా రావత్ 2012లో కాంగ్రెస్ టికెట్పై తొలిసారిగా కేదార్నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, 2016లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్పై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వారిలో ఆమె కూడా ఉన్నారు. ఆ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2022లో బీజేపీ టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.