మల్లారెడ్డి ని గెలిపించాలని కోరిన కేసీఆర్..

మ‌ల్లారెడ్డి లాంటి మ‌నిషి ఉంటే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 6 ల‌క్ష‌ల మ‌న‌షుల‌ను మోయ‌గ‌లుగుతారు. మ‌ల్లారెడ్ది చేసిన సేవ‌ను గుర్తించాలి. క‌ష్ట‌ప‌డి పైకొచ్చాడు. క‌ష్ట సుఖాలు తెలిసిన వ్య‌క్తి. మ‌రోసారి ఘ‌న విజ‌యం చేకూర్చాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గులాబీ బాస్ కేసీఆర్ ..జడ్చర్ల , మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మేడ్చల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..మ‌ల్లారెడ్డి మంచి మ‌నిషి, భ‌గ‌వంతుడు ఆయ‌న‌కు సంప‌ద‌ ఇచ్చాడు. నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాల‌ను సొంత డ‌బ్బుల‌తో అభివృద్ధి చేశాన‌ని చెప్పారు. మ‌ల్లారెడ్డి లాంటి మ‌నిషి ఉంటే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 6 ల‌క్ష‌ల మ‌న‌షుల‌ను మోయ‌గ‌లుగుతారు. మ‌ల్లారెడ్ది చేసిన సేవ‌ను గుర్తించాలి. క‌ష్ట‌ప‌డి పైకొచ్చాడు. క‌ష్ట సుఖాలు తెలిసిన వ్య‌క్తి. మ‌రోసారి ఘ‌న విజ‌యం చేకూర్చాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 93 ల‌క్ష‌ల తెల్ల రేష‌న్ కార్డుల ఉన్నాయి. రైతుబీమా త‌ర‌హాలో కేసీఆర్ బీమా అమ‌లు చేస్తాం. ఎవ‌రికి ఎటువంటి అపాయం క‌లిగిన‌ ఈ బీమా అందుంతుంది. వ్య‌వ‌సాయం అభివృద్ధి చెందింది. పంట‌లు పండిస్తున్నాం.. కాబ‌ట్టి తెల్ల రేష‌న్ కార్డు క‌లిగిన ప్ర‌తి ల‌బ్దిదారుడికి స‌న్న‌బియ్యం స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించాం. అన్న‌పూర్ణ స్కీం కింద స‌న్న‌బియ్యం ఇస్తాం. ఆసరా పెన్ష‌న్లు కూడా పెంచుకుంటున్నాం అని పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు తెలియజేసారు.