Kasireddy Rajasekhar Reddy approaches the High Court

Kasireddy Rajasekhar Reddy : హైకోర్టును ఆశ్రయించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kasireddy Rajasekhar Reddy : జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబరు 23న సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఐటీ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్టు నుండి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రానుంది. ‘మద్యం కొనుగోళ్లలో నేను కీలకపాత్ర పోషించానంటూ ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెట్‌(ఏపీబీసీఎల్‌) అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్‌ సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

Advertisements
హైకోర్టును ఆశ్రయించిన కసిరెడ్డి రాజశేఖర్

సెక్షన్‌ 179(సీఆర్‌పీసీ సెక్షన్‌ 160) కింద నోటీసులు

ఆ తర్వాత సాక్షిగా తమ ముందు విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి పలుమార్లు బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 179(సీఆర్‌పీసీ సెక్షన్‌ 160) కింద నాకు నోటీసులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేసినందునే కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తునకు సహకరించాడనే కారణంతో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసి మాతృసంస్థ రైల్వేలో చేరేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతించినట్లు పత్రికలో కథనం వచ్చింది.

ముందస్తు బెయిల్‌ మంజూరుపై పిటిషన్‌

అన్నీ తానై వ్యవహరించిన వాసుదేవరెడ్డిని రిలీవ్‌ చేసి.. గత ప్రభుత్వంతో సంబంధం ఉన్న నాలాంటివారిని లక్ష్యంగా చేసుకోవడం చట్టవిరుద్ధం. మా కార్యాలయం, నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించి రికార్డులను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సిట్‌ అధికారులు అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంది. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉంటాను. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి అని పిటిషన్‌లో కోరారు.

Read Also : నేడు ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం

Related Posts
రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ పూర్తయింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో 5 గంటలపాటు పోలీసులు వంశీని ప్రశ్నించారు. కృష్ణలంక పీఎస్లో Read more

ఎన్నికను ఒప్పుకుంటున్నాము కానీ పోరాటం ఆపడం లేదు : కమలా హ్యారిస్
kamala harris

2024 యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ చేతిలో ఓడిపోయిన కమలా హ్యారిస్ తన ఓటమిని ఆమోదిస్తూ, "మేము ఈ ఎన్నిక ఫలితాలను ఒప్పుకుంటున్నాం, కానీ పోరాటం Read more

రేపు జగన్ ప్రెస్ మీట్
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో Read more

శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×