విహారయాత్రలో విషాదం: కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి
జమ్మూ కాశ్మీర్ లో సుందర ప్రదేశాలను సందర్శించేందుకు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన జరజాపు చంద్రమౌళి (69), ఉగ్ర మూకల దాడిలో హతమయ్యారు. ఈ విషాద సంఘటన వారి కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన చంద్రమౌళి, మరో రెండు కుటుంబాలతో కలిసి ఈ నెల 16న కాశ్మీర్ టూర్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 25న తిరిగి రావాల్సి ఉండగా, అంతకుముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.వహల్లా సమీపంలో టూరిస్టులంతా ఒకే చోట సేదతీరుతూ ఉన్న సమయంలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టారు. చంద్రమౌళి సహా మరికొంతమందిని గుర్తించి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. చంద్రమౌళి తనను వదిలేయమని వేడుకున్నా ఉగ్ర మూకలు కనికరించలేదు. “మీ ప్రధాని మోడీకి చెప్పుకో” అంటూ ఆయనపై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం చంద్రమౌళి మిస్సింగ్ అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, మరుసటి రోజు అతను మృతి చెందినట్లు సమాచారం అందింది. ఈ ఘటనలో చంద్రమౌళితో కలిసి వెళ్లిన మిగతా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదుల దాడిలో చంద్రమౌళి మృతి: పర్యాటక భద్రతపై ప్రశ్నలు
మృతదేహాన్ని బుధవారం రాత్రి విశాఖకు తరలించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఎంకేజ్ అపార్ట్మెంట్స్ వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందించిన చంద్రమౌళి మృతిచెందిన విషయం అందరిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ సంఘటనతో పర్యాటకుల భద్రతపై పలు ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఉగ్రదాడులు దేశ భద్రతకు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి తేటతెల్లం చేసింది.వారి కుటుంబానికి ప్రభుత్వ స్థాయిలో సానుభూతి మరియు ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కాశ్మీర్ లో భద్రతను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.
Read more : Terror Attack : పాక్పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత