ఉగాది, ఈద్ సందర్భంగా అదనపు బస్సులను నడపనున్న కర్ణాటక బస్సు లు

KSRTC: ఉగాది, ఈద్ సందర్భంగా అదనపు బస్సులను నడపనున్న కర్ణాటక

మరో రెండు రోజుల్లో ఉగాది ఇంకా ఈద్ పండుగలు రాబోతున్నాయి. అయితే ఈసారి ఉగాది పండుగ ఆదివారం, ఈద్ సోమవారం రోజున రానుంది. దీనికి తోడు రేపు శనివారం, దింతో స్కూల్స్, కాలేజెస్ ఇంకా ఉద్యోగాలు చేసేవారికి వరుసగా హాలీడేస్ రానున్నాయి. ఈ తరుణంలో ఉగాది ఇంకా ఈద్ అల్-ఫితర్ పండుగల సందర్భంగా సొంత ఊరు, ప్రయాణాలు చేసేవారికి సౌకర్యాలు కల్పించడానికి అదనపు బస్సులను నడపనున్నట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) తాజాగా ప్రకటించింది. ఈ రోజుల్లో అంచనా వేసినట్లుగా అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ పండుగల సమయంలో 2 వేల అదనపు బస్సులు నడపనున్నట్లు కర్ణాటక స్టేట్ RTC తెలిపింది.

Advertisements
ఉగాది, ఈద్ సందర్భంగా అదనపు బస్సులను నడపనున్న కర్ణాటక బస్సు లు

బెంగళూరు నుండి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులు
మార్చి 30న ఉగాది పండుగ, మార్చి 31న ఈద్ అల్-ఫితర్ జరుపుకునే అవకాశం ఉండటంతో బెంగళూరుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు వివరాలు అందిస్తూ పేర్కొన్నారు. మార్చి 28 నుండి 30 మధ్య బెంగళూరు నుండి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

మార్చి 31 వరకు సర్వీసులు అందుబాటులో

ఈ గమ్యస్థానాల నుండి కర్ణాటక రాజధానికి తిరిగి వచ్చే సర్వీసులు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని అధికారిక ప్రకటన సూచించింది. మరిన్ని వివరాలను అందిస్తూ బెంగళూరులోని కెంపెగౌడ బస్ స్టేషన్ నుండి ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్య, శివమొగ్గ, హసన్, మంగళూరు, కుందపుర, శృంగేరి, హొరనాడు, దావణగెరె, హుబ్బళ్లి, ధార్వాడ్ వంటి వివిధ గమ్యస్థానాలకు మరిన్ని బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. అంతే కాకుండా బెలగావి, విజయపుర, గోకర్ణ, సిర్సి, కార్వార్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పాల, యాద్గిర్, బీదర్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా బస్సులు నడుస్తాయి.

Related Posts
వచ్చే వారం పీఎం కిసాన్ డబ్బులు విడుదల
వచ్చే వారం పీఎం కిసాన్ డబ్బులు విడుదల

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 19వ విడత డబ్బు విడుదలకు సర్వం Read more

కాంగ్రెస్ కంటే కేసీఆర్‌కు ఎక్కువ విరాళాలు
కాంగ్రెస్ కంటే కేసీఆర్‌కు ఎక్కువ విరాళాలు

2023-24లో కాంగ్రెస్ కంటే కేసీఆర్ పార్టీకి ఎక్కువ విరాళాలు, బీజేపీ అగ్రస్థానం 2023-24లో దాతల నుండి రూ. 20,000 మరియు అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో దాదాపు Read more

లాలూ కొడుకు, కుమార్తె లకు బెయిల్
లాలూ కొడుకు, కుమార్తె లకు బెయిల్

బీహార్ ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమ యాదవ్‌, తదితరులకు రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. Read more

ఆప్ నేతల ఆస్తుల వివరాలు
delhi elections

ఢిల్లీలో రాజకీయాల వేడి పుట్టిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 4వ తేదీ జరుగుతుంది. ఇప్పటికే ఇటు అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×