కంగనా రనౌత్కు చంపేస్తామంటూ బెదిరింపులు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్కు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ కొందరు ఓ వీడియో ద్వారా బెదిరించారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోను మహారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. కంగనా నటించిన ఎమర్జెన్సీ చిత్రం త్వరలో రిలీజ్ కానున్నది. ఆ ఫిల్మ్కు చెందిన టీజర్ ఇటీవల రిలీజైంది. ఆ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తున్నారు. కంగనాను వీడియో ద్వారా బెదిరించిన వ్యక్తులు ఓ రూమ్లో కూర్చుని ఉన్నారు. ఇద్దరు మాత్రం నిహంగ్ సిక్కుల తరహాలో డ్రెస్సు ధరించారు. ఒకవేళ ఆ సినిమా రిలీజైతే, అప్పడు దాన్ని ఖండిస్తామన్నారు. మీ సినిమాను చెప్పులతో కొడుతామని ఆ వీడియోలో ఓ వ్యక్తి హెచ్చరికలు చేశాడు.
ఒకవేళ ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్తానీ నేత జర్నెయిల్ సింగ్ భింద్రన్వాలేను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఊరుకోబోమని, ఇందిరా గాంధీకి ఏం జరిగిందో గుర్తు ఉంచుకోవాలని అన్నారు. భింద్రన్వాలేను కొనియాడుతూ విక్కీథామస్ సింగ్ అనే వ్యక్తి వార్నింగ్ ఇచ్చారు. ఇందిరను హత్య చేసిన బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వ్యక్తి వీడియోలో ప్రస్తావించాడు. వీడియోకు చెందిన పోస్టును షేర్ చేస్తూ.. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీసులకు నటి కంగనా ఫిర్యాదు చేశారు.