అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు: మంత్రి తలసాని

kaikalas-last-rites-with-official-ceremonies-minister-talasani

హైదరాబాద్‌ః నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ తెలిపారు. కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి తలసాని.. కైకాల సత్యనారాయణ మూడు తరాలకు గుర్తుండే గొప్ప నటుడని కొనియాడారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన శైలిలో అలరించారని చెప్పారు. 777 సినిమాల్లో నటించడం గర్వించదగ్గ విషయమన్నారు. అటు పాలిటిక్స్ లోను తనదైన ముద్ర వేశారన్నారు.

కైకాల చాలా మందికి ఇష్టమైన నటుడని.. పాత్ర ఏదైనా అందులో జీవించే గొప్ప వ్యక్తి, నటుడు అని తెలిపారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ మన మధ్యలో లేకున్నా చరిత్రలో నిలోచిపోయే వ్యక్తులు అని కొనియాడారు. కుటుంబ సభ్యుల కోరికమేరకు…శనివారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

తాజ ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/