పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు

KA Paul: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు

పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివాదం ఇంకా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదం వల్లే ప్రవీణ్ చనిపోయారంటూ సీసీ కెమెరాల ఫుటేజీతో సహా పోలీసులు చెబుతున్నా… క్రైస్తవ సంఘాలు ఈ ఘటనపై ఆరోపణలు చేస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ప్రవీణ్ ను హత్య చేసి చంపేశారని పిటిషన్ లో కేఏ పాల్ ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisements
పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు

పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్: పాల్
మరోవైపు పక్కా ప్రణాళికతోనే ప్రవీణ్ ను హత్య చేశారని పాల్ తన వాదనలు వినిపించారు. పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్ ఫొటోలని వాదించారు. మృతి ఘటనపై ఎవరూ మాట్లడవద్దని స్థానిక ఎస్పీ అందరినీ బెదిరించారని చెప్పారు. ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదని అన్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టును ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. ప్రవీణ్ మృతిని రోడ్డు ప్రమాదంగా పోలీసులు ప్రకటించిన తర్వాత… సీబీఐ విచారణ కోసం హైకోర్టును కేఏ పాల్ ఆశ్రయించడం గమనార్హం.కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. పాస్టర్ ప్రవీణ్ మరణం వెనక పక్కా కుట్ర ఉందని పాల్ ఆరోపించారు. ప్రభుత్వం కోర్టుకు తెలిపిన ప్రకారం, వీధిలో జరిగిన ప్రమాదం వల్లే ప్రవీణ్ మృతి చెందారు. అప్పటి నుండి పోలీసులు వీడియో ఆధారాలు, సాక్ష్యాలు చూపిస్తున్నారు. ప్రవీణ్‌కు మద్యం అలవాటు లేదు కానీ వదంతులు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Read Also: Sai Reddy: సాయిరెడ్డికే రాజ్య సభ అవకాశాలపై చర్చలు

Related Posts
Telangana: బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్.. వర్సిటీ వద్ద భారీగా పోలీసులు !
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్.. వర్సిటీ వద్ద భారీగా పోలీసులు !

Telangana: హెచ్సీయూ భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా Read more

Minister Lokesh : చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్: మంత్రి లోకేష్
Red Book only for those who violate laws.. Minister Lokesh

Minister Lokesh : మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ Read more

మోడీని పలు అభివృద్ధి పనుల అనుమతిని కోరిన రేవంత్ రెడ్డి
narendra modi and revanth reddy

సోమవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల చిట్టాను విప్పినట్లు తెలుస్తున్నది. ఈ సందర్బంగా Read more

కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్
కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వరుస రైతు నిరసనలు చేయాలనీ ప్రణాళిక చేస్తుంది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×