న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారంలోని కీలక రంగాలపై సమీక్ష నిర్వహించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సహకారం 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. వాణిజ్య ఒప్పందం, ప్రజల శ్రేయస్సు, భౌగోళిక మరియు రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విడుదలైన అధికారిక ప్రకటనలో భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ చర్చలు దోహదపడతాయని వెల్లడించారు. జెడి Jedi Vance కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఆలయ నిర్మాణాన్ని ప్రశంసించారు. ఆలయ నిర్మాణ నైపుణ్యం, కుటుంబ విలువలు, సామరస్యం వంటి అంశాలు వారికి ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఆలయంలోని కాలాతీత జ్ఞాన సందేశాలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతికి ఇది గొప్ప ఘనతగా పేర్కొన్నారు.

Jedi Vance : ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా భారత్-అమెరికా చర్చలు
వాన్స్ కుటుంబానికి ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టులో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వారు న్యూఢిల్లీకి బయలుదేరారు. ప్రధానమంత్రి మోడీ నివాసంలో వాన్స్ దంపతులకు ఇచ్చిన విందులో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నివాసంలో వాన్స్ కుటుంబాన్ని స్వాగతించిన మోడీ వారిని సాదరంగా ఆహ్వానించారు. మోడీ వారిని విందుకు తీసుకెళ్లారు. అనంతరం వారు జయపుర వెళ్ళినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Read More : Modi : నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ