150 వాహనాలతో పోలీస్ స్టేషన్కు బయల్దేరిన జేసీ ప్రభాకర్
తాడిపత్రి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు బయల్దేరారు. అక్కడ నిరసన తెలిపేందుకు తాడిపత్రి నుంచి సుమారు 150 వాహనాల్లో అనుచరులతో వెళ్లారు. తమపై నమోదు చేసిన అక్రమ కేసులకు ఆధారాలు చూపించాలని జేసీ డిమాండ్ చేశారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆయన నిరసన తెలియజేయనున్నారు. రాళ్ల దాడి కేసుల్లో పోలీసులు వైఎస్ఆర్సిపికు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. అనంతపురం ఒకటో పట్టణ పీఎస్ ఎదుట నిరసన అనంతరం జిల్లా ఎస్పీని జేసీ కలవనున్నారు.