నేడు పులివెందులకు జగన్

నేటి నుంచి పులివెందులలో మాజీ సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ఉదయం 11 గంటలకు ఆయన కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత అదే మండలంలోని గొందిపల్లికి చేరుకుని మరో వైసీపీ నేత ఇంటికి జగన్ వెళ్లనున్నారు.

ఇటీవల పెళ్లి చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కూతురు అశారెడ్డి – శివారెడ్డి దంపతులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రానికి పులివెందులలోని తన నివాసానికి జగన్ చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్‌ జగన్‌ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడు రోజులు నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. వచ్చే నెల 4న విదేశాలకు వెళ్తారని సమాచారం.